తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారాలు సాగిస్తూ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చర్యలకు నిరసనగా విశాఖ మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక పూజల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, తిరుమల క్షేత్ర పవిత్రతను అపఖ్యాతికి గురిచేసేలా సాగిన తప్పుడు ప్రచారాలపై వైయస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే, దేవాలయాన్ని కూడా వదలకుండా చేసిన దుష్ప్రచారాలు తగవని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టమైన తర్వాత కూడా నిజాన్ని అంగీకరించకుండా మళ్లీ దుష్ప్రచారాలు చేయడం సరికాదని విమర్శించారు. కూటమి నేతలు భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలని, ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ పాప పరిహార పూజలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొనడం విశేషంగా మారింది. తిరుమల దేవస్థాన పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి బాధ్యత అని, అందుకే ఈ పూజలు నిర్వహించామని వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa