తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని జొన్నకూటి లిఖిత (23) మృతిచెందారు. రాజమహేంద్రవరం సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కారును విశాఖపట్నానికి చెందిన వీరి స్నేహితుడు వి.కిశోర్ నడుపుతున్నారు. రాజమహేంద్రవరం దాటిన తర్వాత దివాన్చెరువు, రాజానగరం మధ్య కారు ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డివైడర్పైకి వెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న లిఖితను కారు బానెట్ నొక్కేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. కారులోని మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడగా వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరో పదినిమిషాల్లో వసతిగృహానికి వెళ్లిపోతారనగా ఈ ఘోరం జరగడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. దీనిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa