ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ కైఫ్ అనే యువకుడు ఆన్లైన్ గేమ్ పబ్జీ (PUBG)కి బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత నాలుగు నెలలుగా ఈ గేమ్కు తీవ్రంగా అలవాటుపడిన కైఫ్, తిండి నిద్ర మాని గంటల తరబడి ఫోన్కే అతుక్కోపోయేవాడు. ఆన్లైన్ ఆటల్లో మునిగిపోవడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
గత శుక్రవారం రాత్రి కూడా ఎప్పటిలాగే కైఫ్ తన హెడ్ఫోన్స్ పెట్టుకుని అర్థరాత్రి వరకు తీవ్రమైన ఏకాగ్రతతో గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఆటలో గెలవాలనే తపన, అందులో ఎదురయ్యే సవాళ్ల వల్ల కలిగే తీవ్ర ఉద్వేగం అతని శరీరంపై విపరీతమైన ప్రభావం చూపింది. ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైన కైఫ్ కుటుంబ సభ్యుల కళ్ల ముందే కుప్పకూలిపోవడంతో, వారు హుటాహుటిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కైఫ్ ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం రాత్రి ఆ యువకుడు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆరోగ్యంగా ఉన్న 22 ఏళ్ల యువకుడు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వైద్యుల పరీక్షల ప్రకారం, నిరంతరం గేమ్ ఆడటం వల్ల కలిగిన విపరీతమైన మానసిక ఒత్తిడి కారణంగా అతని రక్తపోటు (BP) ఒక్కసారిగా 300 దాటేసింది. దీనివల్ల మెదడులోని సున్నితమైన నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం (Brain Stroke) జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యువత ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఇలాంటి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa