ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శత్రువులకు ఊహించని రీతిలో బుద్ధి చెపుతామంటున్న ఇరాన్ ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 02:21 PM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ఆ దేశం అత్యంత తీవ్రంగా పరిగణించింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో తమ అత్యున్నత నేత ప్రాణాలు కోల్పోవడంపై ఇరాన్ కేబినెట్ ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ ‘‘ఘోరమైన నేరానికి’’ కచ్చితంగా బదులు తీర్చుకుంటామని, శత్రువులకు ఊహించని రీతిలో బుద్ధి చెబుతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తమ సుప్రీం నేత మృతికి సంతాపం ప్రకటిస్తూనే, యుద్ధానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చింది. ‘‘చరిత్రలో ఎన్నడూ చూడని అత్యంత భయంకరమైన దాడులు ఏ క్షణమైనా జరగొచ్చు’’ అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ భూభాగంతో పాటు, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa