మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బాటలు వేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆస్తుల పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. అన్యాక్రాంతమైన విలువైన స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రహరీల నిర్మాణం చేప ట్టారు. ఆత్మకూరు జాతీయరహదారి పక్కన ఉన్న సుమారు రూ. 20 కోట్ల విలువైన నాలుగు కాళ్ల మండపం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు అభయ ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గత ఏడాది వర్షాకాలంలో స్వామి వారి దక్షిణ వైపు ప్రహరీగోడ కూలడంతో మరలా నూతనంగా నిర్మిస్తున్నారు. గాలిగోపురం పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నారు. స్వామి వారి ఆలయంలో ప్రస్తుతం రూ. 3. 82 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో దాతలు రూ. 1. 80 కోట్లు అందించారు. భూములు కౌలుహక్కులకు బహిరంగవేలం నిర్వహణను నగరంలోని ఆలయ పరిధిలోనే వేయడం ద్వారా పోటీ పెరిగి ఆ ఆదాయం పెరిగే అవకాశమున్నందున ఇక ముందు వేలం వేసేటప్పుడు ప్రచారం నిర్వహించి ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ఈఓ అన్నపరెడ్డి రామకోటిరెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధి భాగ స్వాములు కావడం అభినందనీయమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa