ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయపాలన పాటిస్తేనే పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు ఏర్పడుతాయని. జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని స్పందన మీటింగ్ హాలులో విద్యాశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు హాజరు కాగా జేసీ సాయి కాంత్ వర్మ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ గురువుల చేతిలో మాత్రమే ఉందని వారి బంగారు భవిష్యత్ కు బంగారు బాటలు వేసే విధంగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎన్నో విద్యా సంస్కరణలు ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధానంగా జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మబడి, మనబడి నాడు నేడు, జగనన్న గోరుముద్ద లాంటి బృహత్కరమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు.
ఈ కార్యక్రమాలు చక్కగా అమలు కావడానికి విద్యాశాఖలోని ప్రతి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అన్ని విషయాలలో మన జిల్లా మరింత మెరుగైన స్థితిలో ఉండడానికి ఉపాధ్యాయులు సమన్వయం చేసుకుంటూ వెల్లాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి నైతిక విలువలు మరింత పెంపొందించడానికి పాఠశాలలో హాజరయ్యే విద్యార్థులు అందరూ కూడా సరైన సమయానికి హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాలనన్నారు. అలసత్వం వహించిన ఉపాధ్యాయుల పైన మరియు సంబంధిత అధికారుల పైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa