బలహీనుల పక్షాన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నారని..ఎవరూ మరచిపోవద్దని మంత్రి జోగి రమేష్ అన్నారు. పేదవారి పక్షాన జగనన్న నిలిచారని గుర్తు చేశారు. పెడన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ నేతన్న నేస్తం నాలుగో విడత కార్యక్రమంలో మంత్రి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఏమన్నారంటే....పెడనకు, మన నియోజకవర్గానికి ఈ రోజు పండగ వచ్చింది. జగనన్న వచ్చాడు..పండగ తెచ్చాడు.
నిజంగా అన్న ఎప్పుడు వస్తాడా? మన నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా ఎదురుచూస్తున్నారు. అన్నా ముఖ్యమంత్రి అయి మూడేళ్లు అవుతుంది. మొట్ట మొదటి సారిగా మన నియోజకవర్గానికి, కొత్తగా ఏర్పాటైన కృష్ణా జిల్లాకు వచ్చిన అన్నకు కృతజ్ఞతలు అని ఆనందం వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa