జనసేన పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలకి తోడుగా నిలబడటంతో ముందుకు వస్తుంది అనడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కౌలు రైతులని ఆదుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రజలకే కాకుండా , జనసేన కార్యకర్తలకి కూడా అండగా ఉండేందుకు జీవిత భీమా లాంటి వి ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే.... ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం జి.వేమవరం గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు మదింశెట్టి శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు గాయపడటంతో జనసేన పార్టీ మెడికల్ భీమా ద్వారా 25,300 రూపాయల చెక్కును నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ చేతుల మీదుగా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa