విద్య. వైద్యం ప్రభుత్వానికి రెండు కళ్లుఅని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణఅన్నారు. ప్రజా ఆరోగ్యానికి. పిల్లల చదువుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఉద్ఘాటన. కొత్తపేట కుమ్మరవీధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి, పాఠశాల అదనపు గదులకు ప్రారంభోత్సవం నిర్వహించారు.విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని అందుకే వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యానికి. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో మరింత ప్రగతి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
పట్టణ పరిధిలోని కొత్తపేట కుమ్మరవీధి 14వ వార్డులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు గదులను, రూ. 98 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘురాజు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, వార్డు కార్పొరేటర్ రాజేష్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ముందుగా నాడు-నేడు నిధులు, కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన కుమ్మరవీధిలోని స్వామి వివేకానంద ప్రాథమిక పాఠశాల గదులను పరిశీలించారు. ఆధునిక వసతులతో కూడిన ఇంగ్లీషు, కంప్యూటర్ ల్యాబ్లను చూసిన మంత్రి మంత్ర ముగ్ధులయ్యారు. పాఠశాలలో అన్ని గదులకు ఏసీ పెట్టించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల రాష్ట్రంలోనే తలమానికమైనదని కితాబిచ్చారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. పుస్తకంలోని అక్షరాలను, బొమ్మలను చూపించి ఇవేంటి అని చిన్నారిని అడిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa