ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయకుడిగా వెలిసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 08:19 PM

హీరోలపై వారి అభిమానులు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి అభిమానమే పవన్ కళ్యాణ్ అభిమానులు చాటుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి, అనేకమంది రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో వినాయక చవితి రానుండగా, విశాఖలో జనసైనికులు ఆసక్తికలిగించే రీతిలో వినాయక ప్రతిమను చేయించారు. 


పవన్ కల్యాణ్ కౌలు రైతులకు ఆర్థికసాయం అందిస్తున్న ఘట్టాన్ని ప్రతిబింబించేలా వినాయక ప్రతిమను చేయించారు. పవన్ ను వినాయకుడిగా మలిచారు. ఆ పవన వినాయకుడే రైతు కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నట్టుగా ఉన్న విశాఖ జనసైనికుల గణేశ్ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa