ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో ఇన్నిసార్లు పర్యటన ఎందుకు చెప్పాలి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 08:56 PM

ఈ మూడేళ్లలో చంద్రబాబు ఆరు సార్లు.. 15రోజులు ఎందుకు పర్యటించాల్సి వచ్చిందో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 33 ఏళ్లుగా కేబినెట్‌లో ఉంటూ కుప్పం కు చంద్రబాబు ఏమి చేయలేదని.. కొల్లుపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. సీఎంను, తనను కుప్పంకు రమ్మని బాబు సవాల్ చేయడం సరికాదని.. అభివృద్ధి చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు టీడీపీ గెలవలేదని ప్రశ్నించారు. తాను ఓడి పోతాననే భయంతోనే చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.


బయటి వ్యక్తులతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేయించారని.. 33 ఏళ్లలో కుప్పంలో బాబు ఎన్ని సార్లు పర్యటించారని ప్రశ్నించారు.  ఎన్నిక లోపు హంద్రీనీవాను పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తి చేయలేదన్నారు. హంద్రీనీవా కాంట్రాక్టర్ టీడీపీ వ్యక్తి అన్నారు.


కుప్పం ప్రజలు చంద్రబాబు ను ఎప్పుడో మరిచి పోయారన్నారు మంత్రి. కుప్పంలో దౌర్జన్యం తోనే చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్నారని.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతో కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపిస్తారన్నారు. కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భరత్ గెలిస్తే మంత్రి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని.. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు కుప్పంలో ఏడు వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. చంద్రబాబు కుప్పంను అభివృద్ధి చేసి ఉంటే ఇళ్ల కోసం ప్రజలు ఎందుకు దరఖాస్తు చేస్తారన్నారు.


ప్రజల మన్నలను పొంది గెలవాలే కానీ రెచ్చగొట్టి కాదన్నారు పెద్దిరెడ్డి. తన సెక్యూరిటీ పెంచుకునేందుకు కుప్పంలో దాడులకు చంద్రబాబు పాల్పడ్డారామో ప్రజలు ఆలోచించాలి అన్నారు. పదే పదే దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెచ్చగొట్టే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు మానసిక స్థితి బాగాలేదన్నారు.. కుటుంబ సభ్యులు చంద్రబాబుకు మంచి వైద్యం చేయించాలని ఎద్దేవా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు గెలిపిస్తారన్నారు. చంద్రబాబు కుప్పంలో ఓడి పోవడం ఖాయమని..గెలిస్తే ఇక చేయగలిగింది లేదన్నారు. తమ కార్యకర్తలను టీడీపీ వాళ్లు కొట్టినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa