ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ దొంగల రాక హాట్ టాపిక్ గా మారింది. వివరాలలోకి పోతే...వారంతాబంగ్లాదేశ్ నుంచి వస్తారు.. చిన్న, చిన్న పనులు చేసుకుంటూ చోరీలు చేస్తారు. ఏటీఎంలను వదలకుండగా దోచేస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా పక్కా ప్లాన్ ప్రకారం ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగారు. చివరికి కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బంగ్లాదేశ్కు చెందిన షేక్ నదీమ్ఖాన్, ఎమ్డీ జహంగీర్,శరణ్సింగ్ సుమన్, అమర్గాసియా బాద్షా, రండా కోకోన్ముల్లా, రఫీక్, రండా సైమన్లు ట్రక్కు డ్రైవర్లుగా, టీ షాపుల్లో పనిచేసేవాళ్లు.
వీరంతా ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని.. భారత్లోకి వచ్చారు. వీరికి కోల్కతాకు చెందిన రాజు అనే వ్యక్తి కలిశాడు. వీరంతా కలిసి ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్నారు. రండా సైమన్ వీరిని లీడ్ చేసేవాడు.. ఏటీఎంలను టార్గెట్ చేస్తూ చోరీలు చేయడం.. ఆ డబ్బులతో బంగారం కొనుగోలు చేసేవారు. అక్కడి నుంచి మకాం మార్చి తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లిపోయేవారు. ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, గోవాల్లో చోరీలు చేశారు. గత ఏప్రిల్ నెలలో భువనేశ్వర్లో ఏటీఎంలో దొంగతనం చేసి రూ.9 లక్షలతో పరారవడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి వీరి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు పోలీసులు మదనాయనహళ్లిలో మరో రూ.12 లక్షలు చోరీ చేసిన కేసులో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశా పోలీసులు మదనాయనహళ్లిలో నిందితులు రండా కోకోన్ముల్లా, కోల్కతాకు చెందిన రాజును అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు బంగ్లాదేశ్కు వెళ్లిపోయారు. ఇక వీరిలో రాఫిక్ అక్కడే ఉండగా.. సహీన్ అనే కొత్త వ్యక్తిని గ్యాంగ్లోకి వచ్చాడు. ఈ నెల 10న ఏడుగురు విజయవాడ వచ్చారు.. రెక్కీ చేసిన ముఠా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉందని 14న గోవా వెళ్లిపోయారు. అక్కడ మరో రూ.15 లక్షలు ఏటీఎంలలో చోరీ చేసి.. తిరిగి 19న విజయవాడ వచ్చారు. 21న గన్నవరం వెళ్లారు.
గన్నవరం దుర్గా ట్రేడర్స్ యజమాని తన ట్రక్కు చోరీ అయ్యిందని అదే రోజు రాత్రి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల్లో బీట్ కానిస్టేబుల్ మణీంద్ర సినిమా హాళ్ల కూడలి దగ్గర ఓ ట్రక్కును గమనించాడు. అదే గ్యాంగ్ ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించగా.. వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించిన కానిస్టేబుల్ మహ్మద్ నదీమ్ఖాన్ను పట్టుకున్నాడు.. అతడు మణీంద్ర చేతిని కొరికి దాడిచేశాడు. కొద్దిసేపటి తర్వాత సమాచారం అందుకున్న స్టేషన్ సిబ్బంది నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కొద్దిసేపటికి మహమ్మద్ జహంగీర్ అనే మరో నిందితుడిని కొత్తపేట దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డబ్బులు, ట్రక్కును సీజ్ చేశారు. పోలీసులకు దొరక్కుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడ్డారు.. కానీ చివరికి దొరికిపోయారు. మిగిలిన వారు బంగ్లాదేశ్కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa