టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నాయకులు తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుకోవడంపై భగ్గుమన్నారు. ఈ మేరకు ఆదివారం నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. వారం ముందే అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నా అనుమతివ్వకపోగా.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
‘‘వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు టిఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనం. వారం రోజుల ముందే అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వకపోగా.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలి. అడ్డగోలు నిర్ణయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలి. జీఓ.77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర డిమాండ్స్ ను తక్షణమే నెరవేర్చాలి.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa