రాష్ట్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం అవమానపరుస్తోందని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం హసనపురం పంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును ఎండగ ట్టారు. అధిక ధరలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు అధికంగా పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా గడప గడప కార్యక్రమంలో ప్రజలను అభాసుపాలు చేస్తున్నారన్నారు. 2024లో తెదేపాను అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రమేష్ రెడ్డి, ప్రభాకర్రె డ్డి, ఈశ్వర్రెడ్డి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు దివ్వ కుమార్రెడ్డి, గడికోట భాస్కర్రెడ్డి, సుభాన్బాషా, రామకృష్ణగౌడ్, శ్రీకాం త్రెడ్డి, సతీష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, శివరెడ్డి, జాబీర్, సహదేవరెడ్డి నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa