ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కి మార్పు వచ్చి ఉపాధ్యాయులని గౌరవించాలి: లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 03:42 PM

అమ్మకి అన్నం పెట్టని వాడు గురువుకి దణ్ణం పెట్టనివాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని, విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.


జగన్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయులకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావని, లిక్కర్ షాపు ముందు సెక్యూరిటీ డ్యూటీ వెయ్యడం దగ్గర మొదలుకొని ఫేషియల్ రికగ్నైజేషన్ వరకూ వేధింపుల పర్వం కొనసాగుతోందని విమర్శించారు. సందర్భంగానైనా జగన్ రెడ్డి ఆలోచనలో మార్పు వచ్చి ఉపాధ్యాయులను గౌరవించాలని కోరుకుంటున్నానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa