జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇటీవల బాగా యాక్టీవ్ గా ఉన్నారు. ఇదిలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనలోని మంచి రచయితను అప్పుడప్పుడు బయటకుతీస్తుంటారు. పుస్తక పఠనంపై ఎంతో మక్కువ కలిగిన పవన్ కళ్యాణ్.. గొప్పవారి కొటేషన్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా చెబుతుంటారు. అప్పుడప్పుడు తనలోని అంతర్మథనాన్ని ఆవిష్కరిస్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. లోతైన మనసు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు.. భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి ఉంటుందని తెలిపారు. అది చిన్న అలజడిలా మొదలై.. సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుందన్నారు. రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుందని పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు.
‘‘లోతైన మనస్సు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగి వుంటుంది. అది చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని తరువాత సమూహాలను ఆపై సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుంది. అటువంటి లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదు.. గందరగోళాలకు బెదరదు.. తర్కానికి అందదు.. కంటికి కనిపించదు. అడ్డుగా ఉన్న అడ్డంకులను భళ్ళున పగులగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది!’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa