టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు మేరకు జరుగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని 25వ వార్డులో 2వరోజు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పద్మశాలీయ కల్యాణ మండపం వద్ద నుండి నేతలు మొదలుపెట్టారు. వార్డు లో ఇంటిఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రజాసమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అని అన్నారు.
కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, పట్టణ టీఎన్టీయూసీ అధ్యక్షులు గోసాల రాఘవ, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎండీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa