ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నానని బాలీవుడ్ వెటరన్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇలా తాను సుదీర్ఘ సమయం పాటు పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఎంతో ప్రజాదరణ కలిగిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షో గురించి ఆయన మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల రెండోసారి కరోనా బారిన పడడం తెలిసిందే. కేబీసీ 14 లో తాజా ఎపిసోడ్ సందర్భంగా కంటెస్టెంట్ బ్రిజ్ కిషోర్ తన ఊపిరి సలపని ఉద్యోగ జీవితం గురించి ప్రస్తావించిన సందర్భంలో.. అమితాబ్ కూడా తన దినచర్య గురించి మాట్లాడారు.
ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ చెప్పారు. మన ఇద్దరిదీ ఒకటే స్థితి అంటూ పోల్చి చెప్పారు. గేమ్ ముగిసిన తర్వాత తిరిగొచ్చి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ తెలిపారు. కరోనా కారణంగా అమితాబ్ ఇటీవలే చిన్న బ్రేక్ తీసుకున్నారు. తాను ఐసోలేట్ అయ్యారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ అమితాబ్ కేబీసీ కార్యక్రమం వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa