ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజా స్పష్టం చేశారు. ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్లేందుకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ ఓ వారధిలా నిలుస్తుందని రోజా అభిప్రాయపడ్డారు.
మంత్రి రోజా బుధవారంనాడు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించారు. రోజా ఇవాళ ఏపీ సచివాలయం బ్లాక్-2లో క్రీడాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రూపొందించిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ఈ సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ద్వారా క్రీడాకారులు సంక్షిప్తంగా తమ వివరాలు అందజేస్తే, వారి సమాచారం క్రీడాశాఖకు చేరడం సులభతరం అవుతుందని వివరించారు. ఈ యాప్ నేపథ్యంలో, సమాచారం అందించే క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామని రోజా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa