ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 08:49 PM

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజా  స్పష్టం చేశారు. ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్లేందుకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ ఓ వారధిలా నిలుస్తుందని రోజా అభిప్రాయపడ్డారు.


మంత్రి రోజా బుధవారంనాడు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించారు. రోజా ఇవాళ ఏపీ సచివాలయం బ్లాక్-2లో క్రీడాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రూపొందించిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ఈ సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ద్వారా క్రీడాకారులు సంక్షిప్తంగా తమ వివరాలు అందజేస్తే, వారి సమాచారం క్రీడాశాఖకు చేరడం సులభతరం అవుతుందని వివరించారు. ఈ యాప్ నేపథ్యంలో, సమాచారం అందించే క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి  ప్రోత్సాహకాలు అందిస్తామని రోజా తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa