ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న భూ హక్కు-భూ రక్ష రీసర్వే వేగవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 10:40 AM

వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు - భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వే వేగవంతం చేయాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఆదేశించారు. గురువారం అమరావతి నుండి సి సి ఎల్ ఎ చీఫ్ సెక్రటరీ, కమిషనర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ సిద్ధార్థ్ జైన్ తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో, సర్వే అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జేసి డికే బాలాజీ, డిఆర్ఓ శ్రీనివాసరావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ పాల్గొన్నారు.


జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 1051 గ్రామాలకు గాను డ్రోన్ ఫ్లై 621 గ్రామాలలో పూర్తి చేసామని తెలిపారు. రీ సర్వే కు సంబందించి నేటికి 69 గ్రామాలలో ఓఆర్ఐ లు పూర్తి కావడం జరిగిందని వివరించారు. 64 గ్రామాల్లో డ్రాఫ్ట్ లాండ్ రిజిస్టర్ మరియు 13 నోటిఫికేషన్ పూర్తి చేసి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 5 గ్రామాల్లో సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. 


పైలెట్ ప్రాజెక్టులు గా చేపట్టిన జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురం, చిల్లకూరు మండలం యోగేస్వరుని పల్లి, గూడూరు మండలం రెడ్డి గుంట, నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామాలలో సచివాలయ స్థాయిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ప్రారంభించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుచున్నదని తెలిపారు. లక్ష్యం మేరకు రీ సర్వే పూర్తి చేసి అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రం అర్హులైన రైతులకు అందచేయనున్నామని వివరించారు. సమావేశ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa