రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బికే లు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు తదితర ప్రభుత్వ ప్రాదాన్యత భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది కమిషనర్ పంచాయతి రాజ్ కోన శశిధర్ తో కలసి గురువారం అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి హాజరై సమావేశానంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ కలెక్టర్ కు వివరిస్తూ జిల్లాలో మంజూరు అయిన 482 గ్రామ సచివాలయాలకు గాను 291 పూర్తి అయ్యాయని , ఇంకా 16 ప్రారంభించాలని, వివిధ దశలలో 175 ఉన్నాయని, రైతు భరోసా కేంద్రాలు 434 గాను 190 పూర్తయ్యాయని, 33 ప్రారంభించాలని, 211 వివిధ దశలలో ఉన్నాయని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు 387 కు గాను 114 పూర్తి అయ్యాయని , 49 ఇంకా ప్రారంభం కానివి ఉన్నాయని తెలుపగా వాటిపై ప్రత్యెక దృష్టి సారించి వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంకనూ ప్రారంభించాల్సి ఉన్న భవనాలను సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో పూర్తి అయ్యేలా లక్ష్యాలు నిర్దేశించుకుని వంద శాతం పురోగతిలోకి తీసుకురావాలని అన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కు సంబంధించి 774 సంపద కేంద్రాలకు గాను అన్ని కేంద్రాలలో చెత్త సేకరణ చేపట్టాలని అందుకు గాను వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని అందిపుచ్చుకోవాలని తెలిపారు. కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లకు సంబంధించి 487 కు గాను వివిధ దశల్లో ఉన్న వాటి నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa