ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో' యాత్రకు రెండవరోజైన గురువారం మంచి స్పందన లభించింది. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో రాహుల్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9.50 గంటలకు సుశీంద్రంకు చేరుకున్న ఆయనకు.. మహిళా స్వయం సహాయక బృందాలు స్వాగతం పలికాయి. అక్కడ వారినుద్దేశించి ప్రసంగించిన రాహుల్.. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి 'భిన్నత్వంలో ఏకత్వం' అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు.
తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం 7.15 గంటలకే రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడుగులు వేశారు. పాదయాత్ర జరిగిన మార్గంలో రోడ్డుకిరువైపులా కాంగ్రెస్ జెండాలతో పాటు జాతీయ పతాకాలను పట్టుకున్న కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అలాగే అనేకమంది చిన్నారులు ఇందిరాగాంధీ, నెహ్రూ, గాంధీ వేషధారణల్లో కనిపించారు. రాహుల్ వారివద్దకు వెళ్ళగా చిన్నారులు రోజా పూలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర కొట్టారాం, సుశీంద్రం మీదుగా సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa