ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి..అంతేకాదు భారత్కు నేనే బెస్ట్ ఫ్రెండ్' అని అన్నారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అలా అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020 ఫిబ్రవరిలో భారత్కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మన ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. మోదీతో కలిసి అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది. ఇక, మోదీపై తరుచూ ప్రశంసలు గుప్పించే ట్రంప్.. తాజాగా మళ్లీ భారత ప్రధానిపై అభిమానం చాటుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. భారత ప్రధాని చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అంతేకాదు, భారత్కు నా కంటే మంచి మిత్రుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసి డొనాల్డ్ ట్రంప్.. మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కంటే తనతోనే భారత్కు మెరుగైన సంబంధాలు ఉన్నాయన్నారు.
మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నారా? అని అడిగితే.. ''నేను పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారు' అని బదులిచ్చారు. దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోసారి అమెరికా అధ్యక్షుడైతే మీ ప్రాధాన్యాలు ఏమిటని ప్రశ్నించగా.. అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలి అనేది తన ఆశయంగా పేర్కొన్నారు. ప్రస్తుత జో బైడెన్ సర్కారు దాన్ని సమీప కాలంలోనూ సాధించే పరిస్థితి లేదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మునుపటిలా వెలుగొందాలని, ఉద్యోగ కల్పన రేటు పెరగాలన్నారు. తన హయాంలో అలాంటి విజయాలన్నీ నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడవి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదన్నారు ట్రంప్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa