యాడికి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ వివాహిత అంజలి (24) మృతి చెందిన సంఘటన శుక్రవారం మం డలంలోని కోనుప్పలపాడు గ్రామంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జక్కసాణికుంట్ల గ్రామానికి చెంది న అంజలికి రెండు సంవత్సరాల క్రితం మండలంలోని కోనుప్పలపాడు గ్రా మానికి చెందిన సంజీవ రాయుడుతో వివాహం జరిగింది. భార్యభర్తలు ఇరువురు కోనుప్పలపాడు గ్రా మంలో నివాసం ఉంటున్నారు. మూడురోజులక్రితం ఆరుబయట మంచంమీద నిద్రిస్తుండగా కట్లపాము మంచంపైకి వచ్చి అం జలిని కాటువేసిందని, దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆరోగ్యప రిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆమె మృతిచెం దినట్లు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa