తమ కష్టాలను, ఆవేదను అర్ధం చేసుకోలేదని, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. బలవన్మరణాల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలోనే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న జరుపుకోవడం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణకోసం ప్రజల్లో అవగాహనను కల్గించడానికి 2003వ సంవత్సరం నుంచి ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తీసుకుని దాని ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుంది.
ఈ యేడాది 2022 థీమ్ క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ పేరుతో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా చూడాలని నిర్ణయించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల కు సంబంధించిన వివరాలను సేకరిస్తే. మానసికంగా ఇబ్బందులు పడే వారు, ఆర్ధికంగా నష్టపోయిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. మానసిక ఇబ్బందులు వచ్చిన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడం వంటి అంశాల కారణంగానే ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం అవగాహన లోపం వల్ల యనభై శాతం మంది మానసిక వ్యాధి గ్రస్తులు ఎటువంటి మానసిక చికిత్సను తీసుకోవడం లేదని, అందువల్లే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa