ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఈవో పేరుతో మెసేజ్ లు...సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టోకరా

national |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 10:22 PM

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకొన్నా సైబర్ నేరగాళ ఆగడాలు మాత్రం ఆగడంలేదు. ఇంకా వారి ఆగడాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ సమకూర్చి వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో తోడ్పాటు అందించిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తాజాగా మోసగాళ్ల బారినపడింది. ఘరానా మోసగాళ్లు సీరం ఇన్ స్టిట్యూట్ ను కోటి రూపాయలకు పైగా టోకరా వేశారు. అది కూడా సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత, సీఈవో అదార్ పూనావాలా పేరిట సందేశాలు పంపించి, తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు పోలీసుల విచారణలో వెల్లడైంది.


దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చీటింగ్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే సీరం ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్లలో ఒకరైన సతీశ్ దేశ్ పాండేకు బుధ, గురువారాల్లో సంస్థ సీఈవో అదార్ పూనావాలా పేరిట వాట్సాప్ సందేశాలు వచ్చాయి. కొన్ని బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేయాల్సిందిగా అదార్ పూనావాలా కోరుతున్నట్టు ఆ సందేశాల్లో ఉంది. దాంతో, సతీశ్ దేశ్ పాండే ఆ సందేశాలు పంపింది తమ సీఈవోనే అని నమ్మి వెంటనే రూ.1,01,01,554 ఆన్ లైన్ లో బదిలీ చేశారు. 


అయితే, అదార్ పూనావాలా ఇలాంటి సందేశాలు వాట్సాప్ లో పంపరన్న విషయం ఆ తర్వాత గుర్తుకు రావడంతో సతీశ్ దేశ్ పాండే అప్రమత్తమయ్యారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఫైనాన్స్ మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa