అభినందనలు తెలిపేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్కు వెళ్లిన మోదీ... ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి ఫలితాలు విడుదలయ్యాక ముర్మును అభినందించేందుకు ఆమెకు కేటాయించిన తాత్కాలిక నివాసంలో మోదీ కలిసిన సంగతి విదితమే. ఆ తర్వాత రాష్ట్రపతిగా ముర్ము పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమెను రాష్ట్రపతి భవన్లో మోదీ భేటీ అయ్యారు. తాజాగా మరోమారు సోమవారం ముర్ముతో భేటీ కోసం మోదీ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa