AP: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల బస్సులు మధ్యలోనే ఆగిపోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో చర్చించి, డీజిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ బస్సు సర్వీసులకు ఎటువంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa