ఎవరెన్ని యాత్రలు చేసినా.. తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై ఆయన మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళతామని తెలిపారు. విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారంటూ ఆయన అమరావతి రైతుల మహాపాదయాత్రపై విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa