వరుస ఝలక్ లను ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామికి బుధవారం ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసేందుకు కోర్టు ఆయనకు 6 వారాల గడువు ఇచ్చింది. బీజేపీ ఎంపీగా పదవీ కాలం ముగిసిన నెలల వ్యవధిలోనే ఆయనకు ఈ తరహా ఆదేశాలు జారీ కావడం గమనార్హం.
సుదీర్ఘ కాలం పాటు జనతా పార్టీలో కొనసాగిన సుబ్రహ్మణ్య స్వామి... ఆ పార్టీకి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. 2013లో జనతా పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో మంత్రిగానూ పదవి చేపట్టారు. బీజేపీలో చేరాక 2016లో రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టిన ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 24న తన పదవీ కాలాన్ని ముగించారు. బీజేపీలో ఉంటూనే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ సాగిన సుబ్రహ్మణ్యస్వామి నిత్యం వార్తల్లోనే ఉండేవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa