ఐసీసీ మాజీ అంపైర్ అసద్ రౌఫ్(66) గుండెపోటుతో కన్నుమూశారు. పాకిస్తాన్ కు చెందిన అసద్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 170కి పైగా మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు. ఇందులో 64 టెస్టులు, 139 వన్డేలు, 28 టీ20 ఉన్నాయి. అసద్ రౌఫ్ ఐపీఎల్ లో కూడా అంపైర్ గా పనిచేశాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడినట్లు అసద్ పై ఆరోపణలొచ్చాయి. దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa