విశాఖపట్నం, అరకు వ్యాలీ: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం సమీపం పెదపాడు రోడ్డు వద్ద ఓ పెళ్లి జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గోపాల్ రెడ్డి నగర్, శేరిలింగంపల్లి గ్రామానికి చెందిన పి సంతోష్ కుమార్, సునీత అనే పెళ్లి జంట హైదరాబాద్ నుంచి బస్సు ప్రయాణంలో విశాఖపట్నం చేరుకొని బుధవారం స్థానిక పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద సందర్శించి, సమీపంలోని పెదపాడు రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు కింద పురుగుల మందు ఇద్దరు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న జంటను ఆ రోడ్డు వైపు వెళ్తున్న స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడ చేరుకుని పోలీసులు, గ్రామ వాలంటీర్ల సహాయంతో ద్విచక్ర వాహనంలో చాపరాయి గెడ్డ దాటించి, అక్కడి నుంచి 108 అంబులెన్స్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించినట్లు తెలిపారు. బాధిత వివాహిత గర్భవతి కావడంతో చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో అరకులోయ ప్రాంతీయ హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు. ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత జంట పోలీసులకు తెలిపినట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa