ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 02:25 PM

బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర తరం అవుతోంది. రోజురోజుకూ ఈ పార్టీల మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీ స్టింగ్ ఆపరేషన్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ ట్రేడర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీ, అమలులో అవినీతి గురించి మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. అయితే తాజాగా దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ కేవలం సీబీఐ, ఈడీలతో బిజీగా ఉండకూడదని కేజ్రీవాల్ విమర్శలు చేశారు.


కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో బిజీగా ఉండకుండా కాస్త పాజిటివ్‌గా కూడా చేయాలి. అలా కాకుండా దేశం ఎలా ముందుకు నడుస్తుంది? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అంతేకాకుండా సీబీఐ, ఈడీ పేరుతో భయపెడుతూ ఉండలేరని ఆయన అన్నారు. 'ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ ప్రస్తుతం సీబీఐ చేతిలో ఉందని మనిష్ శిశోడియా ఇప్పటికే చెప్పారు. దాంతో పాటుగా అన్ని స్టింగ్ ఆపరేషన్స్‌కు సంబంధించిన వివరాలన్నీ కూడా దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఇవ్వాలని తెలిపారు.


ఇప్పటి వరకు లిక్కర్ స్కాం ఎంటో నేను అర్థం చేసుకోలేక పోయాను?' అని కేజ్రీవాల్ అన్నారు. అయితే 'ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాదాపు 1.5 లక్షల కోట్ల మోసం జరిగిందని ఒక బీజేపీ నేత పేర్కొన్నారు. ఢిల్లీ రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.70 వేల కోట్లు. మరి ఒక్క స్కాం విలువ అంత ఎలా ఉంటుంది?. మరో నేత రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. మరో నేత రూ.1100 కోట్లని అన్నారు. సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో రూ.1 కోటి రూపాయాల మోసం జరిగిందని పేర్కొన్నారు' అని కేజ్రీవాల్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa