స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన అర్జీలు, ఎపి సేవా సర్వీసు పోర్టల్, ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ లీగల్ కేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్, తదితర వాటిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ వారం స్పందన అర్జీలపై సమీక్షించాలన్నారు. అర్జీలు పై దృష్టి సారించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించే స్పందనకు ఉదయం 10 గంటలకే జిల్లా అధికారులు హాజరుకావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫోటోలు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఎవరైతే చూస్తున్నారో వారికి అధికారులంతా సూచనలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హార్టీకల్చర్ శాఖ 9 అర్జీలు ఉన్నాయని, ఫోటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటే చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బిలో ఒక అర్జీ పై విచారణ చేసి ఫోటో అప్ లోడ్ చేయాలని చెప్పారు.
ఆర్డబ్ల్యుఎస్ లో 4 ఉన్నాయని, వీటిని త్వరగా పరిష్కరించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిఎస్డబ్ల్యూ 41 ఉండగా ఫోటోలు అప్ లోడ్ చేయలేదని, ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో ను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి 135 ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించాలని, అర్జీలపై ప్రతీ రోజు సమీక్షించుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ 30 ఉన్నాయని, ఇపిడిసిఎల్ 18 ఉన్నాయని, పంచాయతీ రాజ్ 61 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలని హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శేఖర్ ను ఆదేశించారు. ఏ ఒక్కటి అర్జీ పెండింగ్ లో ఉండరాదన్నారు. ఫోటోలు అప్ లోడ్ తో పాటు క్వాలిటీ సమాచారం ఉండాలన్నారు.
ఎండార్స్ మెంటు ఇచ్చినపుడు స్పష్టమైన అడ్రస్ ఉండాలని చెప్పారు. సంతృప్తికరమైన సమాధానం ఉండాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత సమయంలోనే చేయాలని చెప్పారు. పిబిఎస్ఎ కు30 రోజుల్లో పరిష్కరించే సమయం ఉండగా 20 రోజుల్లోనే పరిష్కరించాలన్నారు. ఫోటో అప్ లోడ్ పై ఇడిఎం ఇంద్రశేఖర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ లీగల్ కేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఎపిఎల్ సిఎంఎస్) కార్మిక శాఖ, రెవెన్యూ, దేవాదాయ, ఇండస్ట్రీస్, తదితర శాఖలలో పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. దీనిపై ఇడిఎం ఇంద్ర శేఖర్ వివరంగా వివరించారు. కోర్టు కేసులపై నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు. ఒక సారి పరిశీలించాలని చెప్పారు. ఆయా శాఖలలో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎపి సేవా సర్వీసు పోర్టల్ లో పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa