స్టాక్ మార్కెట్లకు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,093 పాయింట్లు నష్టపోయి 58,840 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 346 పాయింట్లు నష్టపోయి 17,530 వద్ద కొనసాగుతోంది. రియల్టీ, ఐటీ, టెక్ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. బిఎస్ఇ సెన్సెక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రమే (2.63%) లాభపడింది. అల్ట్రాటెక్ సిమెంట్ (-4.51%), టెక్ మహీంద్రా (-4.45%), ఇన్ఫోసిస్ (-3.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.58%), విప్రో (-3.19%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa