పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారందరికీ అదే స్థానాల్లో సీట్లను కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదిలావుంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అప్పుడే 2024 ఎన్నికలపై దృష్టి సారించారు. తాజాగా శుక్రవారం మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు. ఈ భేటి నంద్యాల జిల్లాలోని పాణ్యం, బనగానపల్లె ఇంచార్జీలు గౌరు చరితారెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డితో పాటు ఏలూరు ఇంచార్జీ బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని ఆయన తెలిపారు. ఏ నియోజకవర్గంలో అయినా పనితీరు ఆధారంగానే నేతలకు టికెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు చేరువై... పార్టీని మరింతగా బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa