ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరి గంగమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 07:54 PM

నగరి గంగమ్మ జాతర ముగింపు ఉత్సవాలలో ఏపీ మంత్రి రోజా పాల్గొన్నారు. నగరి నియోజకవర్గ ఆడపడుచుగా నన్ను ఆదరించిన మహిళల కోసం అసెంబ్లీ జరుగుతున్నా వచ్చానని రోజా అన్నారు. నగరి గంగమ్మ జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా మహిళలకు చీరలు అందించారు. నగరి దేశమ్మ, ఓరుగుంటాలమ్మ ఆలయంలో మహిళలకు వస్త్రాలు అందించారు. ప్రతి ఏడాది జాతర ఉత్సవాలను మహిళలతో కలిసి నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిందని.. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రిని అనుమతి కోరగా.. ఆయన అందరి కోసం పంపించారని చెప్పారు. అనంతరం మంత్రి దంపతులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.


ఈ విషయాన్ని మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నగరిలో జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా.. గ్రామ దేవతలు శ్రీ దేశమ్మ తల్లి, శ్రీ ఓరుగుంటలమ్మ తల్లి విశేష పూజలలో పాల్గొని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, గ్రామ మహిళలతో కలిపి మొత్తం 1,400 మందికి చీరలు, ధోవతులు అందజేయడం జరిగింది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa