ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రులు మరణించాక...మూడేళ్లుగా బయటకే రాలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 07:55 PM

మనం ఇంట్లోనే కసేపు కూర్చోవాలంటే ఎంతో సాహసంగా భావిస్తాం. అలాంటి ఈ రోజుల్లో ఏకంగా మూడేళ్లు ఇద్దరు ఇంటినుంచి బయటకే రాలేదంటే. ఇది నమ్మదగినదేనా అంటే అవును అనే చెప్పవచ్చు. ఓ కుటుంబం ఏకంగా మూడేళ్లు సెల్ఫ్ లాక్‌డౌన్‌లో ఉంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరు వింటున్నది నిజమే. అన్న, ఇద్దరు చెల్లెళ్లు మూడేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌‌లో అంబటి తిరుపాల్‌శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరికి వివాహం కాలేదు.. వారి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు మానసికంగా బాగా కుంగిపోయారు. ఈ ముగ్గురు అప్పటి నుంచి బయటి జనాలతో సంబంధాలు తెంచుకున్నారు.


ఈ ముగ్గురు తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్‌ చేసిన డబ్బులకు వచ్చే వడ్డీని నెలకోసారి తిరుపాల్‌ తీసుకుంటారు. ఆయనే రోజూ అరగంటపాటు బయటకెళ్లి కావాల్సిన భోజనాలు, తాగునీరు తెస్తారు. ఆ తర్వాత ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుంటారు. అంతేకాదు కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట అధికారులు ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. అప్పటినుంచి రాత్రిళ్లు చీకట్లోనే గడుపుతున్నారు. దాదాపు మూడేళ్లుగా వీళ్లు ఇంట్లోనే ఉంటున్నారు.


వీరిని గమనించి పలువురు కాలనీవాసులు శుక్రవారం వారి ఇంటి దగ్గరకు వెళ్లి బలవంతంగా తలుపులు తీయించారు. మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో మహిళలిద్దరి జుత్తు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికిగా కనిపించారు. తమ అమ్మానాన్న చనిపోయాక బాధతో ఉన్నామని.. జనాల్లోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితుడు తిరుపాల్‌శెట్టి అంటున్నారు. కరెంట్ బిల్లులు చెల్లించి.. మళ్లీ విద్యుత్‌ను పునరుద్దరించుకుంటామంటున్నారు. మొత్తానికి ఈ కుటుంబం వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa