ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ నుంచి రాజాపూర్ వరకు బీజేపీ బస్సు యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 02:14 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం విశాఖ నుంచి రాజాపూర్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈరోజు విశాఖ నుంచి ఐదు వేల ప్రజా పోరు సభలను ప్రారంభిస్తున్నామని బీజేపీ నేతలు జీవీఎల్, విష్ణుకుమార్ రాజు , ఎమ్మెల్సీ మాధవ్  అన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  భవిష్యత్తు, అంథకారమయంగా మారిందన్నారు. కుటుంబ పార్టీలు, దిశ దశ లేకుండా పాలన చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు.. ట్రేడింగ్ జరుగుతోందన్నారు. రెండు కుటుంబ పార్టీలు బీజేపీతో దోబూచులాడుతున్నాయని, డ్రామాలాడుతున్నాయన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని ఉందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు ఉంటున్నారు.. వాల్తేర్ క్లబ్, బే పార్క్, రాజధానా?.. భూములిచ్చిన రైతులను రోడ్డుమీద పడేశారని, దీనికి ఎవరు బాధ్యులన్నారు. గత ప్రభుత్వం రాజధాని కట్టలేదు.. ఈ ప్రభుత్వం పని చేయలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు... వైసీపీ, టీడీపీలు, వాష్  అవుట్ అవుతాయన్నారు. పోలవరంపై విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలని, మూడేళ్లలో విశాఖపట్నంలో ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa