సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలోని కైలసకోన జలపాతంపై తమిళనాడు నుండి భార్యని తీసుకొని వచ్చి హతమార్చిన భర్తను నారాయణవనం పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ సురేష్ బాబు తెలిపారు. తమిళ్ సెల్వి తన చెడు వ్యసనాలను ప్రశ్నిస్తూ ప్రతి రోజు గొడవ చేసేదని, అందుకు ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని హత్య చేసినట్లు భర్త తెలిపారు. అతను చదువుకునే రోజుల్లో సందర్శించిన కైలసకోన జలపాతంపై ఎవరు ఉండరని అక్కడకి తీసుకొని వచ్చి హత్య చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa