ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదం తొక్కుతున్న ఆశ వర్కర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:22 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం ధర్నా చౌక్ నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు చేపట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.


కరోనా వంటి విపత్కర సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఎంతగానో శ్రమ పడ్డ తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కేవలం తమకు ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa