తిరుపతి నగరంలో కరకంబాడి మార్గం నుండి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం రోడ్డులోని వాసవి భవన్ వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టిటిడి ఈవో ఎవి. ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. సెప్టెంబరు 27వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని, ఇందుకు అవసరమైన పనులు 26వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
మున్సిపల్, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణపనులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులకు ఈవో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజి, మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఇ మోహన్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగస్వామి పలువురు అదనపు ఎస్పీలు, డిఎస్పీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa