ప్రేమ్ నగర్లోని ఒక పార్కులో అరుణ్ పంచాల్ను రూ. 200 దోచుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడంతో ఇద్దరూ కలిసి అరుణ్ పంచాల్ను హతమార్చారని పోలీసులు తెలిపారు. నేరానికి ఆయుధంగా ఉపయోగించిన ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 18న అరుణ్ పంచల్ హత్యకు సంబంధించిన సమాచారం అందిందని సెంట్రల్ డిసిపి తెలిపారు. విచారణలో, పోలీసు బృందం సిసిటివి ఫుటేజీ ఆధారంగా నేరంలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి, వారిలో ఇద్దరిని పట్టుకోవడంలో విజయం సాధించింది.జూదం ఆడేందుకు మృతుడి నుంచి రూ.200 డిమాండ్ చేశారని, అయితే అతడు నిరాకరించాడని విచారణలో వెల్లడించారు. చోరీకి ప్రయత్నించగా అతడు అడ్డుకోవడంతో హత్య చేశారు.మూడో నిందితుడు రవికాంత్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa