ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా జయంతి వేడుకలు బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా విగ్రహానికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు హాఫీజ్ఖాన్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గుర్రం జాషువా కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడని తెలిపారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. అగ్రవర్ణ దురహంకారాలను చవిచూసిన జాషువా సౌమ్య పదజాలంతోనే వాటిని ఎదిరించాడని తెలిపారు. కుల వివక్షతను రూపు మాపిన మహా కవి గుర్రం జాషువా అని కొనియాడారు. జాతీయ ఉద్యమం, సామాజిక ఉద్యమాన్ని సమాంతరంగా నడిపిన గొప్ప వ్యక్తి అన్నారు. కలంతో కుల వివక్షత అన్న దానిని రూపుమాపారన్నారు. నాటక రంగంలో ఆయన రచించిన హరిశ్చంద్ర ఈ రోజుకు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు నాకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa