ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే గాలికి వదిలేసి, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ పాలకులను ఇంటికి పంపాలి అని నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని 01వ వార్డులో సాయి నగర్ లో స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.... 45 ఏళ్లు నిండిన బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు పింఛన్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కరకీ కూడా ఇవ్వలేదు. ఆర్థిక భారం పేరిట నిత్యావసరాల సరుకుల ధరలను ఆకాశాన్ని అంటించిన ఘనత వైసీపీదే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa