రోలుగుంట కోపరేటివ్ బ్యాంకు నుంచి మండల పరిషత్ కార్యాలయ వరకు వికేంద్రీకరణకు విశాఖపట్నం రాజధానికి మద్దతుగా గురువారం మహిళలతో భారీ ర్యాలీనిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, చోడవరం శాసనసభ్యులు శ్రీకరణం ధర్మశ్రీ పాల్గొని మూడు రాజదానుల ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మహిళలు పాల్గొన్నారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వంకార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోలుగుంట మండలం నిండుగొండ గ్రామంలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు.
వెంటనే పరిష్కారం అయ్యే విధంగా అధికారులను ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa