రాష్ట్రంలో మత్తుపదార్థాలైన డ్రగ్స్, గంజాయి వంటి వాటిని నియంత్రణ చేసి యువత భవిష్యత్తు కాపాడాలని తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, నియోజకవర్గ అధ్యక్షులు పెడిరెడ్ల సత్యనారాయణలు కోరారు. శుక్రవారం గజపతినగరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఒకప్పుడు దేశం మొత్తం బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు గంజాయ్ ఆంధ్రప్రదేశ్ గా మారడం బాధాకరమన్నారు. నార్కో టిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక 2021 ప్రకారం గంజాయి అక్రమ రవాణా లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందనడం, దేశవ్యాప్తంగా 2021 సంవత్సరంలో 7. 49 లక్షల కిలోలు గంజాయి పట్టుబడితే అందులో ఆంధ్రప్రదేశ్ లోనే రెండు లక్షల కిలోలు పైగా పట్టుబడటం యువత భవిష్యత్తు పై ఆందోళన కలిగిస్తుందన్నారు. మత్తు పదార్థాలకు బానిసై గత ఏడాదిలోనే 571 మంది యువత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్. సి. ఆర్. బి ప్రకటించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాల పరిస్థితి ఆలోచిస్తే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా ఎక్కువగా సాగడానికి కారణం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోవడమే అని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ గంజాయి, నియంత్రణ చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa