మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీ, లింగాపురంలోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం డాక్టర్ ఎంవీఆర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఎంపీ అవినాశ్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎంవీఆర్ స్మృతిసంచికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాచమల్లు శివ ప్రసాద్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఏపీఎస్ఎస్ బీసీ అడ్వయిజర్ చల్లా మధుసూధన్రెడ్డి, కడప మేయర్ సురేశ్బాబు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి, భూమన్, తాడి ప్రకాశ్, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ఎంవీఆర్ తనయులు మల్లెల మురళీధర్రెడ్డి, మాజీ ఉప ఎంపీపీ మల్లెల రాజారామిరెడ్డి, ఎంవీఆర్ కోడళ్లు మల్లెల ఉమ, మల్లెల కాంతమ్మ, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, మల్లెల గౌతంరెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్యాదవ్, వైసీపీ జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa