ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్ మహాల్ నిర్మించింది షాజహాన్ కాదటా...కోర్టుకు చేరిన కొత్త పంచాయతీ

national |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 10:46 PM

గతంలో ముస్లిం పాలకులు చేపట్టిన నిర్మాణాలపై  గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజ్ మహల్ నిర్మాణంపై స్పష్టతనిచ్చి, వివాదాలకు తెర దించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. డాక్టర్ రజనీశ్ సింగ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చెపుతున్నప్పటికీ దానికి చారిత్రక ఆధారాలు లేవని పిటిషన్ లో ఆయన తెలిపారు. ముంతాజ్ కోసం షాజహాన్ 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెపుతున్నప్పటికీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. 


ఇదే అంశంపై క్లారిటీ కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కు సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశానని... అయితే, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్టు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని సమాధానం వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa