ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే గాంధీ సందేశాన్ని ఈ యాత్ర ద్వారా ఇస్తున్నాం: రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 08:45 PM

ఇప్పుడన్నీ హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయని.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్‌ జోడో యాత్రలో ప్రచారం చేస్తున్నామని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకప్పుడు మన జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు దేశంలో విద్వేషాన్ని నింపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి మాట్లాడారు. నాడు జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని.. కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోందని.. ఆరోపించారు.


ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కొత్తగా గాంధీ సిద్ధాంతాలను వల్లిస్తున్నారని, ఇలా వల్లించడం సులభమేగానీ.. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కష్టమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము మొదటి నుంచీ గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తున్నామని.. ఆయనను చంపిన సిద్ధాంతంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa